వరికూటి ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గం, దొనకొండ మండలంలోని కట్టకిందపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి మరియు దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజు సమక్షంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల నమోదు కార్యక్రమంను ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో కట్టకిందపల్లి గ్రామంలోని జనసైనికులు అంతా వరికూటి నాగరాజుతో మాట్లాడి, జనసేన పార్టీకి మా మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలుపుతూ క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసుకోవడం జరిగినది. ఈ సందర్భంగా వరికూటి నాగరాజు మాట్లాడుతూ జనసేన పార్టీ వైపు యువత ఎప్పటికప్పుడు ముందుకు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు.