దక్షిణంలో కార్పొరేటర్ కందుల సేవా కార్యక్రమాలు

దక్షిణ వైజాగ్ నియోజకవర్గంలో 32 వ వార్డు కార్పొరేటర్, నియోజకవర్గ జనసేన నాయకులు కందుల నాగరాజు సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలోనూ అవసరమైన వారికి తన సహాయం అందజేస్తున్నారు. ఈ క్రమంలో 32వ వార్డు, 37వ వార్డులలో పుష్పవతి అయిన ఇద్దరు అమ్మాయిలకు పట్టుబట్టలను అందజేశారు. 32వ వార్డు లో చెరువుగట్టు ప్రాంతానికి చెందిన ధనూష, 37వ వార్డు చెంగల రావు బజార్ ప్రాంతానికి చెందిన వైష్ణవిలకు పట్టుచీరలు అందజేశారు. ఈ సందర్భంగా కందుల నాగరాజు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సహాయం చేయడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో పలువురికి తన పరిధి మేరకు సేవలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజక వర్గంలో ఒక వార్డుకే పరిమితం కాకుండా అన్ని వార్డులలోనూ తన సేవలను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం లో 32వ వార్డు ఇంచార్జ్ బద్రీనాథ్, కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ కేదార్నాథ్, మహేష్ బాబు, జానకి, కనకమహాలక్ష్మి, కోదండమ్మా, దుర్గ, కుమారి, రోజి, వెంకటేష్, తాతారావు, సూరిబాబు, ఎర్రంశెట్టి సురేష్ కుమార్, గరికిన రవి, జోగరాజు తదితరులు పాల్గొన్నారు.