పోలవరంలో జనసేనలో చేరికలు

పోలవరం, జీలుగుమిల్లి మండలం, స్వర్ణవారిగూడెం పంచాయితీలో నాయకులు తొమ్మిదెల సూర్యచంద్రం, మాజీ సర్పంచ్ సపోటా సుబ్బారావు ఆధ్వర్యంలో.. పోలవరం జనసేన కన్వీనర్ చిర్రి బాలరాజు మరియు జిల్లా కార్యదర్శి గట్టమనుగు రవి.. సుమారుగా 50 మంది యువత మరియు పెద్దలను జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యకమానికి మండల ప్రధానకార్యదర్శి వీరంకి వెంకటేశ్వరావు, ప్రచార కార్యదర్శి చిర్రి రామ్ పండు, శేఖర్, మధు, ములగలంపల్లి పంచాయితీ ప్రెసిడెంట్ సరియం రాజు, సరియం ముత్యాలరావు, దిబ్బ గూడెం నాయకులు కొమరం వెంకటేశ్వరరావు మరియు జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-03-19-at-21.51.08-2-1024x472.jpeg