20వ వార్డులో పర్యటించిన ఆదిమూలం సారణీ దేవి

విశాఖ తూర్పు నియోజకవర్గం, 20వ వార్డు మహిళలతో కలసి ఆ వార్డు జనసేన అభ్యర్ధి మరియు ఉత్తరాంధ్రా ప్రాంతీయ మహిళాసభ్యురాలు ఆదిమూలం సారణీ దేవి వారి సమస్యలను తెలుసుకొని, జనసేన మేనిఫెస్టో వివరించి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్న రైతుల లెక్కను వైసిపి ప్రభుత్వానికి ఎత్తిచూపిస్తూ వారి కుటుంబాలకు ఒకొక్కరికి లక్ష రూపాయలు అందచేయడమేకాక వారి కొంతమంది పిల్లలను చదివించే బాద్యత తీసుకోవడం జరిగిన విషయాలు, ఉచిత ఇంటి పధకాల్లో జరిగిన అక్రమాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ప్రాంతీయ సభ్యురాలు నాగలక్ష్మీ, 20 వ వార్డు వీరమహిళలు మహాలక్ష్మి, ధన పాల్గొనడం జరిగింది.