పాలకుర్తి జనసేన పార్టీ నూతన కమిటీ నియామకం

  • రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండల కమిటీ నియామకం
  • అధ్యక్షులుగా బూస శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా సాయి కుమార్

రామగుండం నియోజకవర్గం: పాలకుర్తి మండల జనసేన పార్టీ కమిటీ సభ్యులను రామగుండం ఇంచార్జి మూల హరీష్ గౌడ్ విడుదల చేసారు. పాలకుర్తి మండల అధ్యక్షులుగా బూస శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా సాయి కుమార్ ను నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మూలా హరీష్ గౌడ్ మాట్లాడుతూ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని, రామగుండంలో ఉన్న సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతామని, జనసేన పార్టీ సిద్ధాంతాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రక్రిలో భాగంగా పాలకుర్తి మండల కమిటీను వేశారు. త్వరలో గ్రామ కమిటీ కూడా నియమిస్తామని అన్నారు.