బండారు శ్రావణి గెలుపు కోసం అహర్నిశలు కష్టపడతాం: నార్పల జనసేన
సింగణమల, జనసేన-తెలుగుదేశం-బిజెపి కూటమి అభ్యర్థి బండారు శ్రావణిశ్రీని తిరుగులేని మెజారిటీతో గెలిపించుకోవడానికి మా శక్తి వంచన లేకుండా కష్టపడతామని జనసేన నాయకులు శపథం చేశారు. మండల పరిధిలోని నాయన పల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ద్విసభ్యకమిటీ సభ్యులు, తెలుగుదేశం నాయకులు ఆలం నరసా నాయడు, వెంకట నరసానాయుడు, ఆకుల ఆంజనేయులు మరియు జనసేన నాయకులతో కలసి ప్రత్యేక పూజలు చేసి కూటమి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ ప్రచారాన్ని ప్రారంభించారు. శ్రావణితో పాటు ప్రచారంలో పాల్గొన్న నార్పల మండలం జనసేన నాయకులు ఇంటింటికి వెళ్లి కూటమి అభ్యర్థి బండారు శ్రావణిని కచ్చితంగా గెలుపించుకోవలన్నారు. శ్రావణి విజయం శింగణమల ప్రజలకు ఎంత అవసరమో ప్రజలకు వివరించారు. ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలను గ్రామస్తులకు వివరించి అవగాహన కల్పిస్తూ ప్రచారాన్ని సాగించారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ ని 10 సంవత్సరాల వెనక్కి తీసుకువెళ్లిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-16-at-20.30.46-scaled.jpeg)