దొంగ ఓట్లు పోల్ అవకుండా ఉమ్మడి అభ్యర్థి గెలుపునకు కృషిచేయాలి

మదనపల్లి, రాబోయే ఎన్నికలలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ అధికారం రాకుండా, దొంగ ఓట్లు పోల్ అవకుండా ఉమ్మడి అభ్యర్థి గెలుపునకు ఎలా పని చేయాలి, పలు రకాల అంశాలపై మదనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో మదనపల్లి జనసేన నాయకులు రామ రామాంజనేయులు సమావేశం నిర్వహించడం జరిగింది. చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, పట్టణ అధ్యక్షులు నాయిని జగదీష్ బాబు ఈ కార్యక్రమంలో పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు కోటకొండ చంద్రశేఖర్, కుప్పాల శంకర, అశ్వత్, ధరణి, యాసిన్, గణేష్, సోను, హర్ష, అశోక్, కిరణ్ కుమార్ రెడ్డి, శ్రీనాథ్, గురు, గంగాధర్, శ్రీనివాసులు, సిద్దయ్య, రమేష్ మహిళా నాయకులు శ్రీమతి మల్లికా, రూప బిసి అధ్యక్షులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.