మెతుకు రమేష్ పార్థివదేహానికి నివాళులర్పించిన అలహరి సుధాకర్

కావలి నియోజకవర్గం: మహిళా నాయకురాలు మెతుకు రాజేశ్వరి భర్త సోమవారం అకాల మరణం చెందటంతో బోగోలు బిట్రగుంట లోని వారి నివాసంలో మెతుకు రమేష్ పార్థివదేహానికి కావలి నియోజకవర్గ ఇంచార్జ్ అలహరి సుధాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతంరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. భగవంతుండు వారి కుటుంబానికి అండగా ఉండాలని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సురేష్, కృష్ణయ్య, కొండయ్య వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.