2వ విడత వారహి విజయ యాత్రకు సర్వం సిద్దం

ఏలూరు నియోజకవర్గం: జులై 9న 2వ విడత వారహి విజయ యాత్ర ఏలూరు నుంచి ప్రారంభం అవుతున్న తరుణంలో ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు శుక్రవారం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటుచెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాన్ గారి వారహి యొక్క రూట్ మ్యాప్ ని ప్రకటించడం జరిగింది. ప్లెక్సీలకు జెండాలకు, ర్యాలి, బహిరంగ సభకు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ నుంచి అనుమతులు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి చిర్రి బాలరాజు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, జనసైనికులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.