కిడ్నీ సమస్యతో బాధపడుతున్న జనసైనికునికి అండగా నిలిచిన అమలాపురం జనసేన

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్, పాలగుమ్మి గ్రామం కంభంపాడు జనసైనికుడు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని ఆ గ్రామ జనసేన నాయకులు మద్దింశెట్టి నాగు ద్వారా తెలుసుకున్న రూరల్ మండల అధ్యక్షులు శ్రీ లింగోలు పండు వెంటనే స్పందించి అతని కుటుంబ సభ్యులకు 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి నాగ మానస, నల్లా వెంకటేశ్వరరావు, మోసుగంటి మల్లిక మరియు ఆ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.