తాడిపత్రి జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

తాడిపత్రి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, డా. బీ.అర్ అంబేద్కర్‌ 132వ జయంతి సందర్భంగా తాడిపత్రి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి పట్టణంలోని డా.బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతీయుల గుండెల్లో చిరస్మరణీయుడు, దేశ ప్రజల కోసం ఆయన చేసిన కృషిని ఆదర్శంగా తీసుకొని అంబేద్కర్ అడుగు జాడల్లో జనసైనికులు అందరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కిరణ్ కుమార్, పట్టణ అధ్యక్షులు నరసింహచారి, ఉపాధ్యక్షులు హర్షద్ అయూ, బి గోపాల్, పట్టణ ప్రధాన కార్యదర్శులు సయ్యద్ రసూల్, కొండా శివ, మణికంఠ, రమణ, హరి, రాహూల్, హేమంత్, రాయుడు, శ్రీను అదేవిదంగా పెద్ద పప్పూరు మండల నాయకులు మరియు నియోజకవర్గ జనసైనికులు పాల్గొన్నారు.