అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు విరాళం అందించిన టి. సి వరుణ్

సింగనమల: జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ తన గొప్ప సేవా గుణాన్ని మళ్లీ చాటుకున్నారు. నార్పల మండలం గూగూడు గ్రామంలో డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోసం 10,000 రూపాయలు విరాళాన్ని గూగూడు గ్రామ విగ్రహ ఆవిష్కరణ కమిటీ సభ్యులకు అందించారు. అంబేద్కర్ గారు అంటే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాన్ కి అభిమానం అని, ఎంతగానే గౌరవిస్తారని గుర్తు చేసారు. విగ్రహం ఏర్పాటు చేయడం కోసం కష్టపడుతున్న కమిటీ సభ్యులను అభినదించారు. ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆ స్థాయికి ఎదగడం కోసం ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో వాటిని భావితరాలకు తెలియచేసే బాధ్యత తీసుకోని ఆయన బాటలో నడవడానికి కృషి చేయాలన్నారు. విగ్రహ ఏర్పాటులో నన్ను కూడా భాగస్వామ్యుడిని చేసినందుకు సంతోషం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జిల్లా ఉపాధ్యక్షుడు ఈశ్వర్, నగర అధ్యక్షుడు బాబు రావు, శింగనమల సమన్వయ కర్త సాకే మురళి కృష్ణ, నార్పల మండల కన్వీనర్ గంజికుంట రామకృష్ణ, బుక్కరాయసముద్రం మండల కన్వీనర్ ఎర్రి స్వామి విగ్రహ కమిటీ సభ్యులు దేవేంద్ర, సాయి, అయ్యప్ప, సన్నీ రాజు, కుళ్లాయప్ప, రాజశేఖర్, రామయ్య తదితరులు పాల్గొన్నారు.