అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆద్వర్యంలో అంబేత్కర్ జయంతి వేడుకలు

  • అంబేద్కర్ కు నివాళులు అర్పించిన ముఖ్య అతిథులుగా హాజరైన జనసేన నాయకులు గురాన అయ్యలు, డిస్ట్రిక్ట్-102 గవర్నర్ కర్రోతు సత్యం

విజయనగరం: అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను శుక్రవారం ఉదయం కలక్టరేట్ కూడలిలో ఉన్న అంబేత్కర్ విగ్రహం వద్ద క్లబ్ వ్యవస్థాపకధ్యక్షుడు, జనసేన పార్టీ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా అంబేద్కర్ విగ్రహానికి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా హాజరైన డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ కర్రోతు సత్యం, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ సంఘ సేవకులు గురాన అయ్యలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆధునిక భారతదేశ చరిత్రను ప్రభావితం చేసిన మహానీయుల్లో అగ్రగామని,అణగారిన జీవితాల్లో అక్షర జ్యోతిని వెలిగించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని కొనియాడారు. కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ కార్యదర్శి కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, జనసేన నాయకులు, వాకర్స్ క్లబ్ పెద్దలు ఆదాడ మోహనరావు, ఎంటి రాజేష్, వంక నరసింగరావు, దంతులూరి రామచంద్ర రాజు, శ్రీను తదిరులు హాజరయ్యారు.