క్రియాశీలక జనసైనికునికి ప్రమాదభీమా చెక్కు అందజేసిన గాదె

చిలకలూరిపేట నియోజకవర్గం మునిసిపాలిటీలో 3వ వార్డు రాజీవ్ గాంధీ కాలనీలో నివసిస్తున్న జనసైనికుడు కుంచాల సాయి దుర్గాప్రసాద్ రోడ్డు ప్రమాదానికి గురవడం జరిగింది. ఈ విషయాన్ని నియోజవర్గం జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావుకి తెలియజేయడం జరిగింది. జనసేనపార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గాయపడ్డ జనసైనికుడికి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 50,000/- చెక్కుని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావుకి పంపగా సోమవారం గాయపడ్డ జనసైనికుడి ఇంటికి వెళ్ళి వారి కుటుంభ సబ్యులకు చెక్ ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, రామచంద్ర ప్రసాద్, సెస్.కె. సుభాని, పఠాన్ జ్ఖాదర్ భాష, శిఖా బాలు, నెల్లూరు రాజేష్, గల్లా వెంకటరావు, మునీర్ హసన్, లీల కిషోర్, ముద్ద యోబు, గాలి రాజా, శంకర్, కొటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.