మృతురాలు కుటుంబానికి అండగా సాయిప్రియ సేవాసమితి వ్యవస్థస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు

గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన యేడిద పెంటమ్మ అకాలంగా మరణించడం జరిగింది. సాయిప్రియ సేవాసమితి వ్యవస్థస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు సోమవారం యేడిద పెంటమ్మ కుటుంబ సభ్యులను కలిసి యేడిద పెంటమ్మ మరణం పట్ల ప్రగాడ సానుభూతి తెలిపి యేడిద పెంటమ్మ కుటుంబం ఆర్థికం ఇబ్బంది పరిస్దితులను దృష్టిలో ఉంచుకొని 50 కేజీల బియ్యం, నగదు సహయంగా చేబ్రోలు గ్రామపెద్దల సమక్షంలో సాయిప్రియ సేవాసమితి ద్వారా అందించారు. ఈ కార్యక్రమంలో గంటా గోపి, అడ్డాల సాయి, నాగబాబు, కారకాటి అప్పారావు, దొండపాటి శ్రీను, అడ్డాల నాగబాబు, వేమగిరి దేవయ్య, దొండపాటి నాగరాజు, అడ్డాల ఏసుబాబు, శీలి వెంకన్న, యేడిద అర్జమ్మ, గంపల దొరబాబు, యేడిద సత్తిబాబు, యేడిద మరియ, జ్యోతుల సీతరాంబాబు, పిఠాపురం మండల సాయిప్రియ సేవాసమితి కార్యదర్శి మేడిబోయిన హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.