బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి చావుకు కారణంపై విచారణ జరపాలి

భైంసా పట్టణంలోని టీఎన్జీవో కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసిన జనసేన పార్టీ, బిసి వెల్ఫేర్ అసోసియేషన్, యస్ఎఫ్ఐ వారు మాట్లాడుతూ బాసర ట్రిపుల్ ఐటీలో రోజుకో ఘటన సంచలనాన్ని సృష్టిస్తుంది. భాధ్యత వహించాల్సిన అధికారులు నిర్లక్షంగా వ్యవహరించడం వల్ల అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. చావుకు కారణలు పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అడ్మినిస్ట్రేషన్ కి పూర్తి భాద్యతలు అప్పజెప్పి యూనివర్సిటీలో సెక్యూరిటీ సిబ్బందికి ప్రత్యేక అనుమతులు ఇచ్చి, పోలీస్ పికేటింగ్ నిర్వహించాలని కోరుతున్నాం. యూనివర్సిటీకి ఇప్పటికే అనేక రూపాల్లో చెడ్డ పేరు తెచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు, బిసి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దాండ్ల శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు నవీన్ లు పాల్గొన్నారు.