మట్టి వినాయకులను పంపిణీ చేసిన అనంతపురం జనసేన

అనంతపురం, జనసేన పార్టీ సిద్ధాంతాలలో ఒకటైన పర్యావరణాన్ని పరిరక్షించే విధానంలో భాగంగా మంగళవారం అనంతపురం నగరంలోని స్థానిక సప్తగిరి సర్కిల్ నందు జిల్లా అధ్యక్షులు మరియు అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్ ఆధ్వర్యంలో నగర ప్రజలకు మట్టి గణపతులను జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చిలకం మధుసూదన్ రెడ్డి, కార్యక్రమాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భవానీ రవికుమార్ ల చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గాల ఇంచార్జ్ లు మరియు జిల్లా కమీటీ సభ్యులు, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.