పండ్లు పంపిణీ చేసిన అనంతపురం జనసేన నాయకులు

అనంతపురం, జిల్లా అధ్యక్షులు మరియు అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్ ఆదేశాల మేరకు అనంతపురం నగరంలోని సోమనాథ్ నగర్ మరియు రజకుల కాలనీలోని మంగళవారం కురిసిన భారీ వర్షానికి ఇల్లు అన్ని జలమయం కావడంతో బాధితులను పరామర్శించి వాళ్లకి పండ్లు పంపిణీ చేసిన జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా సహాయ కార్యదర్శి విజయ్ కుమార్, ముప్పూరి కృష్ణ, జిల్లా కార్యక్రమాల కమిటీ నిర్వాహణ సభ్యులు పామురాయి వెంకటేష్, నగర సహాయ కార్యదర్శి నెట్టిగంటి హరీష్ మరియు జిల్లా నాయకులు పవనిజం రాజు పాల్గొనడం జరిగింది.