రైతన్నలకు అండ – జనసేన జెండా: తమేష్ గాలిదేవర
తూర్పుగోదావరి జిల్లా, రెండో విడత “జనసేన కౌలు రైతు భరోసా యాత్ర”లో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 40 మంది కౌలు రైతుల కుటుంబాలను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శనివారం పరామర్శించి, లక్ష రూపాయలు చొప్పున చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఐటి కోఆర్డినేటర్ గాలిదేవర తమేష్ కొనియాడారు. ఇప్పటివరకూ దేశ రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ చేస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఐటీ టీంలో పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేసే జనసైనికులు తనని సంప్రదించవలసినదిగా కోరారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-23-at-8.48.04-PM.jpeg)