ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం 21వ రోజు

సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, జంగాల కండ్రిగ గ్రామంలో ఆంధ్రా అభివృద్ధి – జనసేన తోనే సాధ్యం 21వ రోజు కార్యక్రమాన్ని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ముత్తుకూరు మండలంలోని జంగాల కండ్రిగ గ్రామంలో జనసేన పార్టీ నాయకులు కరపత్రాలు పంచుతూ పార్టీ సిద్ధాంతాలను, జనసేన పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి ప్రస్థానాన్ని వివరిస్తూ ఈ కార్యక్రమం కొనసాగగా.. గ్రామస్థులు మాట్లాడుతూ మేము మొదటినుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమని, రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతో ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చామని, సొంత పార్టీ వారిమైన మాకే పింఛన్లు ఆపేసారని, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని నమ్మించి మోసం చేసారని, వైసీపీ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నామని, ఈసారి పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇచ్చి వైసీపీ ని అధికారం నుంచి దించేయాలని భావిస్తున్నామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పోలూరు పెంచల నరసింహా, సి.హెచ్ కసుమురు, ఏపూరు నాగేంద్ర, తాండ్ర శ్రీను పాల్గొన్నారు.