సత్తెనపల్లి జనసేన కార్యాలయంలో అంజనాదేవి పుట్టినరోజు వేడుకలు

సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన కార్యాలయంలో కొణిదల చిరంజీవి, కొణిదల పవన్ కళ్యాణ్, నాగబాబు లాంటి ముగ్గురు ఆణిముత్యాలకి జన్మనిచ్చిన మాతృమూర్తి అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా.. సత్తెనపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీస్ లో పూల కొట్టు బాజీ చేతుల మీదుగా కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, జనసేన నాయకులు, వీరమహిళలు, ఆ దేవుని ప్రార్థించడం జరిగింది. ఆ తల్లి చల్లని దీవెనలతో మా జనసేన పార్టీ అధినాయకుడు కొణిదల పవన్ కళ్యాణ్ 2024లో సీఎం కావాలని మనసారా కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసరావు, దమ్మాలపాడు ఎంపీటీసీ సిరిగిరి రామారావు, వల్లెం శ్రీనివాసరావు, ఆదినారాయణ, తిరుమల శెట్టి గోపి, సూరం శెట్టి సతీష్, చల్ల గరుడ, బుర్రి సైదయ్య, దుర్గారావు, తాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.