అంకమ్మ తల్లి తిరునాళ్లలో పాల్గొన్న బొర్రా వెంకట అప్పారావు

సత్తెనపల్లి నియోజకవర్గం, శనివారం రాజుపాలెం మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో అంకమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా మండల అధ్యక్షులు తోట నరసయ్య ఆధ్వర్యంలో గ్రంధి సదా శివుడు నేతృత్వంలో బొర్రా వెంకట అప్పారావుని ఈ తిరునాళ్ల మహోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆహ్వానించడం జరిగింది. బ్రాహ్మణపల్లి జనసైనికుల ఆహ్వానం మేరకు ఈ యొక్క తిరునాళ్లకు బొర్రా వెంకట అప్పారావు విచ్చేసి అంకమ్మ తల్లి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించి, ఆశీస్సులు తీసుకోవడం జరిగినది. గ్రామస్తులు నిర్వహించిన జనసేన ప్రభను సందర్శించి రానున్న రోజుల్లో జనసేనని మరింత బలంగా ప్రజలకు తీసుకువెళ్లి 2024 లో పవన్ కళ్యాణ్ ను సీఎం చేసే దిశగా మనందరం అడుగులు వేయాలని జనసైనికులకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మండల అధ్యక్షులు కౌన్సిలర్ ప్రోగ్రాం కమిటీ మెంబర్స్, మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ అధ్యక్షులు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.