పండంటి పాపకు జన్మనిచ్చిన అనుష్క శర్మ

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. అనుష్క శర్మ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కోహ్లీ ట్విట్టర్, ఇన్ స్టా వేదికగా తెలిపాడు. అనుష్క శర్మ ఈ మధ్యాహ్నం పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం పాప, అనుష్క శర్మ ఇద్దరూ ఆరోగ్యం ఉన్నట్లు కోహ్లీ తెలిపాడు. ఈ సమయంలో దయ చేసి ప్రైవసీకి భంగం కలిగించొద్దని కోహ్లీ ఫ్యాన్స్ ను కోరాడు. ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న కోహ్లీ పితృత్వపు సెలవుల మీద కోహ్లీ భారత్ కు తిరిగొచ్చాడు. ఈ వార్తను కోహ్లీ స్వయంగా సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశాడు. `మేము త్వరలో ముగ్గురం కాబోతున్నాము. 2021 జనవరిలో పండంటి బిడ్డ రాబోతోందని కోహ్లీ గతేడాది ఆగస్టులో ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. ‘ఇవాళ మధ్యాహ్నం మాకు కూతురు పుట్టిందన్న విషయాన్ని మీతో పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు. అనుష్క, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు, మా జీవితంలో ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సమయంలో మా ప్రైవసీని మీరంతా గౌరవిస్తారని ఆశిస్తూ.. ప్రేమతో మీ విరాట్’ అంటూ కోహ్లీ ఓ లేఖను ట్విటర్లో పోస్ట్‌ చేశాడు.