దేవి చౌక్ వద్ద శ్రీదేవి నవరాత్రులు మహోత్సవాలలో అనుశ్రీ
రాజమండ్రి సిటీ, స్థానిక దేవి చౌక్ వద్ద శ్రీదేవి నవరాత్రులు మహోత్సవాలు సందర్భంగా రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు మర్యాదలతో సాదరంగా ఆహ్వానించారు. ఆలయ పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు వేద ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు అనుశ్రీ దంపతులను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా అనుశ్రీ మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ ఉత్సవాలు జరుగుతాయని జగన్మాత ఆ చల్లని తల్లి విజయదుర్గమ్మ కరుణా కటాక్షాలు ఎప్పుడు ప్రజలపై ఉండాలని ఆకంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-04-at-22.31.51-1024x476.jpeg)