ఎడ్లంక గ్రామానికి వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ జనసేన నిరసన దీక్ష

అవనిగడ్డ నియోజక వర్గం: గౌరవ సీఎం జగన్ మోహన రెడ్డి గారు గత సంవత్సరం అక్టోబర్ నెలలో అవనిగడ్డలో జరిగిన బహిరంగ సభలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుని 8.5 కోట్లు నిధులు విడుదల చేయాలని, ఎడ్లంక గ్రామానికి వెంటనే వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతూ గురువారం ఎడ్లంక గ్రామంలోని కృష్ణా నదీ తీరంలో నిరవధిక నిరసన దీక్ష ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మాణం విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చేవరకు దీక్ష కొనసాగుతుందని, లేని పక్షంలో నియోజక వర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఈ విషయంను తీసుకు వెళ్లి నిధులు విడుదల చేయించే వరకు కూడా జనసేన పార్టీ పోరాటం కొనసాగుతుందని మండల పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు చెప్పారు.