‘రాజధాని’ పాదయాత్రకు ఏపీ హైకోర్ట్ అనుమతి

అమరావతి రైతుల మహా పాదయాత్రకు ఏపీ హైకోర్ట్ అనుమతులు జారి చేసింది. డిజిపి రైతుల  పాదయాత్రకు అనుమతి నిరాకరించడంతో హైకోర్టును వారు ఆశ్రయించారు. నేడు విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు తీర్పును వెల్లడించింది. రైతుల పాదయాత్రకు అనుమతి ఇస్తే అభ్యంతరం ఏంటని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు మహా పాదయాత్రను చేపట్టారు. న్యాయస్థానం నుండి దేవస్థానం పేరుతో ఈ పాదయాత్ర చేయాలని అమరావతి పరిరక్షణ సమితి, జెఎసి నిర్ణయించాయి. 45 రోజుల పాటు నిర్వహించే ఈ పాదయాత్రకు ఇప్పటికే సిపిఎంతో పాటు పలు పార్టీలు మద్దతు తెలిపిన సంగతి విదితమే.