ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ – జనసేన విజయ యాత్ర 63వ రోజు

  • మార్పు కోసం గ్లాసు గుర్తుకి ఓటు వేయండి – వినుత కోటా గారిని ఆశీర్వదించండి

శ్రీకాళహస్తి నియోజకవర్గం: 63వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారంలో భాగంగా మంగళవారం శ్రీకాళహస్తి పట్టణం గోపాలవనంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో ప్రచారం నిర్వహించి రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది.
రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్న జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని ఆదరించాలని, నియోజకవర్గంలో శ్రీమతి వినుత కోటా గారిని ఆశీర్వదించి, గాజు గ్లాసు గుర్తు కి ఓటు వెయ్యాలని ప్రజలను కోరడం జరిగింది. మార్పు కోసం జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. డ్రైనేజ్ కాలువలు పరిశుభ్రం చెయ్యడం లేదని, స్ట్రీట్ లైట్లు వేయలేదని, అధిక ధరలతో చిన్న కుటుంబాలు ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తోట గణేష్, ఉపాధ్యక్షులు రవి కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు ప్రమోద్, కవిత, రాజ్య లక్ష్మి, ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్, మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, పేట చంద్ర శేఖర్, నాయకులు నక్కా ప్రసాద్, లక్ష్మి, రాజేష్, గురవయ్య, సురేష్ గరిక, తోట సురేష్, శారద, ఉదయ్, మల్లిగుంట చిన్న మునాయ్య జనసైనికులు దినేష్, బబ్లూ, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.