ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్- జనసేన విజయ యాత్ర

  • శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన ఇంఛార్జి వినుత కోటా ఇంటింటికీ ప్రచారం 19వ రోజు

శ్రీకాళహస్తి నియోజకవర్గం: నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి నియోజకవర్గం, రేణిగుంట మండలం, పనీరు కాల్వ, ఎస్ ఆర్ పట్టేడ గ్రామాలలో మంగళవారం ఇంటింటికీ ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదు రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని కోరడం జరిగింది. గ్రామంలో డ్రైనేజ్ కాలువలు, స్ట్రీట్ లైట్లు సమస్యలు గ్రామస్థులు తెలిపారు. ప్రభుత్యం అధికారంలోకి వచ్చిన 3-6 నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల ఉపాధ్యక్షులు వాకాటి బాలాజీ, నాయకులు కోబాకు ముని కుమార్ భాస్కర్ బాబు, భాగ్య లక్ష్మి, అనురాధ, శ్రీనివాసులు, లోకనాధం, మాజీ ఎంపీటీసీ జయలలిత, నాదముని, తోట గణేష్, రవి కుమార్ రెడ్డి, పేట చంద్ర, సురేష్, రాజేష్, గురవయ్య, చిరంజీవి, జ్యోతి రామ్, బాబు, జనసైనికులు గోవర్ధన్, మోహమద్ అలి, సాయి పవన్, ధనుష్ తదితరులు పాల్గొన్నారు.