కోవిడ్ కమాండ్ కంట్రోల్ చైర్మన్గా జవహర్రెడ్డి నియామకం
అమరావతి: కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘కోవిడ్ కమాండ్ కంట్రోల్’ చైర్మన్గా తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డా.కెఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన తక్షణమే బాధ్యతలు స్వీకరించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్19 నియంత్రణ, వ్యాక్సినేషన్ కార్యక్రమాలను ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రం ప్రతిరోజు పర్యవేక్షిస్తుంది.