కొత్తగూడెం జనసేన మండల కమిటీ నియామకం

కొత్తగూడెం, జనసేన పార్టీ కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వేముల కార్తీక్ 4 కోట్ల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసి వేలాది మంది ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అని, అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని, అభివృద్ధి పథంలో దూసుకెళ్ళాలని జనసేనపార్టీ తరపున ఆకాంక్షిస్తూ, తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియోజకవర్గంలో జనసేన పార్టీ జనసేన తెలంగాణ కొత్తగూడెం మండల కమిటీ నియామకం జరిగింది. కొత్తగూడెం నియోజకవర్గంలో జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, తెలంగాణ ఇంఛార్జి శంకర్ గౌడ్, తెలంగాణ ముఖ్య నాయకులు రామ్ తాళ్లూరి, రాధారం రాజలింగం సూచనల మేరకు కొత్తగూడెం మండల కమిటీని నియమించడం జరిగింది.

అధ్యక్షులు: ఎండీ సాదిక్ పాషా

ఉపాధ్యక్షులు:
విజయ్ కుమార్ పాసి
అనుమొల త్రినాధ్

ప్రధాన కార్యదర్శి:
శ్రీమతి గుబ్బల సీతామహాలక్ష్మి
మారల్లి విజయ్ కుమార్

ఆర్గనైజింగ్ సెక్రటరీ:
బాలకృష్ణ సాకా
షైక్ మున్న
డేవిడ్ రాజ్ గడుదుల

సెక్రటరీ:

శ్రీ వద్దునూరి బాలకృష్ణ
శ్రీ మహ్మద్ ముజాఫర్ హుస్సేనీ

సోషల్ మీడియా సెక్రటరీ:
గుబ్బల సతీష్ కుమార్

ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్:
దార సాయినాథ్
బంగరి శివకుమార్
బేతం నాగరాజు
సూరిమేని హరీష్ యాదవ్
సయీద్ పాషా మహమ్మద్

జనంకోసం పాటు పడే సైనికుల్లా నిరంతరం ప్రజల పక్షం అంటూ
ఓకే నినాదంతోసాగాలని కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ కోసం ఎప్పుడూ శ్రమిస్తూనే ఉంటారని, అలాగే ఈ అవకాశం ఇచ్చిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం కో-ఆర్డినేటర్ వేముల కార్తీక్ చెట్టుకు పోసిన నీరు, జనసేనకు వేసిన ఓటు వృధా కాదని, చెట్టు పదిమందికి నీడనిస్తుంది, జనసేన పార్టీ పదిమందికి సహాయపడుతుందని ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తామని తెలియజేశారు.