వి.ఆర్.పురంలో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

వి.ఆర్.పురం: జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వి.ఆర్.పురం మండల అధ్యక్షులు ములకాల సాయికృష్ణ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణలు, పండ్లు, పాలు ఇతర పంపిణీ కార్యక్రమాలు జరిగాయి.. ముందుగా జీడిగుప్ప గ్రామంలో సీనియర్ నాయకులు మండల ఉపాధ్యక్షులు కనుగుల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం శ్రీరామగిరిలో మండల యూత్ లీడర్ పరంకుశం మణికంఠ మరియు జనసైనికుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబడిన జండా దిమ్మ ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ర్యాలీగా రేఖపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు మరియు పాలు పంపిణీ చేయడం జరిగింది. ఆ తరువాత సంత మార్కెట్ వద్ద ఏర్పాటుచేసిన సభ స్థలికి చేరుకొని నాయకుల ప్రసంగం అనంతరం జనసేన తెలుగుదేశం పార్టీల అధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. తదనంతరం సంతపాకల వద్ద మరియు ధర్మతాళ్ళగూడెంలో ప్రజలకు వెజ్ బిర్యాని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం తాపత్రపడే వ్యక్తి అని, ఆయన సేవాగుణానికి ఎవరైనా ముగ్దులు అవుతారని అన్నారు మరికొన్ని రోజుల్లో నియంత పాలన పోతుందని జనసేన, తెలుగుదేశం, బిజెపి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తధ్యమని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షురాలు బాగుల ప్రమీల, జెడ్పీటీసీ వాళ్ళ రంగారెడ్డి,మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ పెడపెట్ల పవన్ కళ్యాణ్, కోట్ల విజయరామరాజు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఆచంట శ్రీనివాస్, బీజేపీ మండల అధ్యక్షులు ముత్యాల రాంబాబు, నాయకులు పసుపులేటి నవీన్, కార్యదర్శి బురకా కన్నారావు, పెట్ట నాగేంద్ర బాబు, బీరక ప్రకాశరావు, కారం నాగేంద్రబాబు, ముత్యాల సిద్దు, ముంజపు సాయి, ముంజపు శ్రీరామ్, ముత్యాల చంద్రశేఖర్, కట్టం ధర్మరాజు, పెందుర్తి సుదర్శనరావు, నాగేశ్వరరావు, యం.రవి, మడివి నాగు, కారం వెంకటేష్, మిడియం దుర్గ ప్రసాద్, కోట్ల సాయి కుమార్, గొంది చంద్రయ్య, సవలం రాజేంద్ర, పెట్ట దుర్గా ప్రసాద్, ముత్యాల గణేష్ కుమార్, రేవు శివ, నవీన్, పిట్ల రానా ప్రతాప్, గెడ్డం రాజు, జల్లి చంటి, దుర్గా ప్రసాద్, శ్రీరామగిరి ఉప సర్పంచ్ కొడిచల దుర్గారావు, నాల్లారపు సత్యవతి, పెట్ట వెంకన్న బాబు, ముత్యాల పోసి బాబు, జలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.