జనసేన ఆధ్వర్యంలో శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలకు ఉచిత ఆటో సర్వీసు ఏర్పాటు

  • ఆటో సర్వీసులను ప్రారంభించిన రాష్ట్ర జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి కిర్తన, రాజంపేట జనసేన పార్టీ నాయకులు అతికారి దినేష్

రాజంపేట నియోజకవర్గం: యర్రంశెట్ట హరిరాయల్, గంగారపు చంద్రశేఖర్, గంటా రమేష్ జనసేన పార్టీ కువైట్ సభ్యుల మరియు కుంచా శంకరా పాటూరు, మద్దెల శ్రీను, వాసు సహకారంతో నందలూరు మండల జనసేన నాయకుడు ఉమ్మడి కడప జిల్లా ప్రోగ్రామ్ కమిటీ కార్యవర్గ సభ్యులు గురివిగారి వాసు ఆధ్వర్యంలో శ్రీ సౌమ్యనాథ స్వామి కళ్యాణోత్సవానికి విచ్చేయు భక్తుల కోసం ఉచిత ఆటోలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి కిర్తన, రాజంపేట జనసేన పార్టీ నాయకులు అతికారి దినేష్ జనసేన జెండా ఊపి ప్రారంభించారు. మొదటిసారి ప్రతిష్టాత్మకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ సౌమ్యనాథ స్వామి కళ్యాణోత్సవంలో వేలాది సంఖ్యలో పాల్గొనే ప్రజల కోసం దాదాపుగా 20 ఉచిత ఆటోలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాటురు సుబ్బయ్య, మస్తాన్ రాయల్, కొట్టే హరిష్, తిప్పాయ్యపల్లె ప్రశాంత్, పాటురు డాల, సునిల్ గౌడ్, సాయి పవణ్, మంకు వెంకటేష్, గోవర్థన్, హరీష్, పసుపులేటి వెంకటేశ్&సతీష్, మండెం రాము, రత్నం, ఉపేంద్ర, చిన్నా, హేమంత్, గుగ్గీళ్ళ నాగార్జున, వెంకటేష్, భరత్, చెన్నంశెట్టి శివ కుమార్, చెన్నంశెట్టి శివకృష్ణ, పసుపులేటి మల్లి, సుబ్బరాయుడు, పెంచలయ్య, సానిపాయి జనసేన నాయకుడు గుగ్గిళ్ళ నాగర్జన, గుగ్గిళ్ళ వెంకటేశ్, ఏం హేమంత్, పండ్రా రంజిత్, ఎం.నాగరాజు, పోకల వెంకట సుబ్బయ్య, భువనగిరి పల్లె జనసేన నాయకులు కొలాటం హరి, రాజంపేట జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.