రాజారెడ్డిపై వైసీపీ రౌడీ మూకల దాడి హేయమైన చర్య: పెండ్యాల శ్రీలత

• ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటమి భయంతో ధర్మవరంలో కేతిరెడ్డి అశాంతి అలజడులు, సృష్టించాలని చూస్తున్నారు.

  • జనసేన పార్టీ రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత

ధర్మవరం, వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి ప్రోధ్భలంతో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూధన్ రెడ్డి సమీప బంధువు జనసేన నాయకుడు పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే రాజారెడ్డిపై వైసీపీ మూకలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించి, రాజారెడ్డిని జనసేన పార్టీ రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోతుకుంట సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న జనసేన పార్టీ కార్యాలయం దగ్గర రాజారెడ్డి పనులను పరిశీలిస్తుండగా వైసీపీ మూకలు ధర్మవరం వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రోద్బలంతో విచక్షణా రహితంగా కర్రలతో, రాళ్లతో దాడి చేసి రాజారెడ్డిని తీవ్రంగా గాయపరచడం చాలా బాధాకరమైన విషయమని నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా మరొక్కసారి ఇటువంటి దాడులు పునరారుతం కాకుండా జనసేన పార్టీ తరపున బలంగా పోరాటం చేస్తామన్నారు.