కంబదూరు మండలంలో అట్టహాసంగా జనసేనాని జన్మదిన వేడుకలు

కళ్యాణదుర్గం: కంబదూరు మండలంలో అట్టహాసంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరిగాయి. వేడుకలలో భాగంగా మండల అధ్యక్షులు చంద్రమౌళి నాయకులు జనసైనికులు, వీరమహిళలు ఆధ్వర్యంలో ప్రసిద్దిగాంచిన మల్లేశ్వరస్వామి ఆయంలో ఉదయం అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రమాదవశాత్తు గాయపడిన భవన నిర్మాణ కార్మికులు వన్నూరు స్వామి కుటుంబాన్ని పరమార్శించి, జనసేన తరఫున ఎల్లవేళలా అండగా ఉంటాం అని బరోసా ఇచ్చి వారికి 15,001 ఆర్థికసాయం చేయడం జరిగింది. అనంతరం శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద బాణసంచా కాల్చి కేకే కట్ చేసి నాయకులు, జనసైనికులు, వీర మహిళల ఆధ్వర్యంలో 1000 మందికిపైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాజుల శ్రీనివాసులు, వడ్డే శ్రీనివాస్, నేతి మహేష్, తిప్పేస్వామి, రాంప్రసాద్,వెంకీటేష్, గండికోట జగదీశ్, సురేష్, మాచపల్లి రాధా, గాజుల అనిల్, సుబ్బు, కే మహేష్, ఏశ్వంత్, మహేష్, మునీంద్రా, రాము, చంద్ర, గిరీష్, కిరణ్, పవన్, నవీన్, శ్రీకాంత్, మణికంఠ, హరి, శ్రీనాథ్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.