క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంపై వీరఘట్టంలో అవగాహన
వీరఘట్టం, జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి ఒకే ఎంపీటీసీ విభాగానికి చెందినటువంటి మూడు గ్రామాలైన కిమ్మి, కొట్టుగుమ్మడ, గెడగాం గ్రామ ప్రజలకు మరియు యువతకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వీరఘట్టం మండల నాయుకులు వజ్రగడ రవికుమార్ జానీ మాట్లాడుతూ.. దాశాబ్దాలకు పైగా రెండు కుటుంబాల మద్యనే అధికారం ఉండటం వలన రాష్ట్రము అంధకారంలో ఉండిపోయిందని.. కానీ ఇపుడు ప్రజల కోసం.. ప్రజలకు సేవ చెయ్యడానికి పవన్ కళ్యాణ్ రాజకీయంలోకి వచ్చారని ఒక్కసారి జనసేనకి అవకాశం ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-26-at-14.57.32-1024x461.jpeg)