అశోక్ గజపతిరాజుకి శుభాకాంక్షలు తెలిపిన అయ్యలు

విజయనగరం, తెలుగుదేశం పొలిట్‌ బ్యూరో సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుని బుధవారం జనసేన నేత గురాన అయ్యలు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. పూలమొక్క అందజేసి, శాలువాతో సత్కరించి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై చర్చించడం జరిగింది.