పాము కాటుకు మరణించిన విద్యార్ధి కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన బాబు పాలూరు

కురుపాం నియోజకవర్గం, కొమరాడ మండలం దలయ్యపేట గ్రామానికి చెందిన మంతిని రంజిత్ కుమార్ అనే విద్యార్థి మొన్న కురుపాం ప్రభుత్వ వసతి గృహంలో పాము కాటుకు గురయ్యి మరణించడం జరిగింది. ఆ విద్యార్థి కుటుంబాన్ని రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు మరియు పార్వతీపురం కురుపాం నియోజకవర్గాల నాయకులు, జనసైనికులు పరామర్శించడం జరిగింది. ఆ కుటుంబానికి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని బాబు పాలూరు భరోసా ఇవ్వడం జరిగింది.