బాబు షూరిటి భవిష్యత్ గ్యారెంటీ

సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, ఇందిరమ్మ కాలనీలో బాబు షూరిటి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమానికి విచ్చేసిన సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారి సతీమణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముత్తుకూరు మండల టీడీపీ మండలాధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, బీజేపీ ముత్తుకూరు మండలాధ్యక్షుడు సంపత్ రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు బోనుబోయిన ప్రసాద్ పిలుపు మేరకు జనసేన పార్టీ ముత్తుకూరు మండలాధ్యక్షుడు మనుబోలు గణపతి గారు,మండల ఉపాధ్యక్షుడు పోలూరు నరసింహా(పి.ఎన్.పి) మండల ప్రధాన కార్యదర్సులు చినకంగారి కుసుమూరు, తాండ్ర శ్రీనివాసులు, కార్యదర్శిలు మంగాపురం బాలు, పట్టపు నవీన్ తదితరులు పాల్గొన్నారు.