రోడ్ల సమస్యపై జనసేన వినతిపత్రంపై స్పందించిన అధికారులు

భైంసా సాత్ ఫూల్ బ్రిడ్జిరోడ్ గుంతలు ఉండటంతో గత 3నెలల ముందు దానికి సంభందించిన అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తరువాత అధికారులు స్పందించి కొద్దిగ గుంతలను పూడ్చడం జరిగింది. అదేవిధంగా దేగం గ్రామం నుంచి బాసర వరకు రోడ్ రిపేర్ గురించి కూడా
సంభందించిన రోడ్ ప్యాచ్ వర్క్ ఇస్టిమెట్ వేసి అధికారులకు పంపడం జరిగింది త్వరలో ఆ పని కూడా పూర్తి అవుతుంది అని అధికారులు తెలపటం జరిగింది. జనసేన ఇచ్చిన వినతిపత్రం వల్ల అధికారులు స్పందించటం జనసేన విజయం అని జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొనటం జరిగింది.