చలివేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్న బడేటి చంటి, రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గం 1 టౌన్ గాంధీ మైదానం వద్ద కీ.శే. మధ్యాహ్నపు అనసూయమ్మ గారి జ్ఞాపకార్థం మాజీ ఊడ చైర్మెన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం గారి కుటుంబ సభ్యులు ఏర్పాటుచేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఈరోజు ఏలూరు అసెంబ్లీ టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రారంభోత్సవంలో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ మధ్యాహ్నపు బలరాం దంపతులు ప్రతి సంవత్సరం వేసవికాలంలో ఇలాంటి చదివేంద్రాలు పెట్టడం ఎంతో శుభ పరిణామని, వేలాదిమందితో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో చలివేంద్రాన్ని పెట్టడం అభినందనీయం.. పాదచారులకు దాహార్తిని తీర్చేందుకు వారి తల్లి గారైన కీర్తిశేషులు అనసూయమ్మ గారి జ్ఞాపకార్థం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు.. బలరాం గారి దంపతులు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఏలూరులో మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామని అన్నారు.. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎం ఆర్ డి గ్రూప్స్ అధినేత మధ్యాహ్నపు రామకృష్ణదాస్, మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం, మధ్యాహ్నపు ధనుంజయరావు, దివంగత బడేటి బుజ్జి గారి అల్లుడు కొట్టు మనోజ్, జనసేన జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్, కంచన రామకృష్ణ, నూకల సాయి ప్రసాద్, జనసేన రవి, విటాల చంద్రశేఖర్, నిమ్మల రవి, మేకా సాయి, అరవింద్, టిడిపి నాయకులు వీరంకి త్రినాధ్, భారత వెంకట్రావు, కృష్ణమోహన్, శ్రీనివాసరావు, బొలుసు బాబు, గుడివాక మోహన్, చోడే బాలసుబ్రమణ్యం, రాళ్లపల్లి రవికుమార్, లంక బోస్, వీరమాచనేనిచందు, మధ్యాహ్నపు నాని జనసేన టిడిపి నాయకులు మరియు ఎం ఆర్ డి అభిమానులు పాల్గొన్నారు.