రామచంద్రపురంలో రక్తదాన శిబిరం

రామచంద్రపురం, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలలో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు గ్రామంలో కీర్తిశేషులు అన్యం గోవిందు జ్ఞాపకార్థం రామచంద్రపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అద్యక్షులు కందుల దుర్గేష్, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ, అమలాపురం జనసేన పార్టీ పార్లమెంటరీ ఇంచార్జ్ డి.ఎం.ఆర్ శేఖర్, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.