తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు

 జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరైంది. బెయిల్ రావడంతో సాయంత్రం జైలు నుంచి విడుదల కానున్నారు మల్లన్న.

ఓ జ్యోతిష్యుడిని బ్లాక్‌ మెయిల్‌ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేశారన్న ఆరోపణలతో ఆగస్ట్‌లో అరెస్ట్ అయిన మల్లన్నపై జైలులో ఉండగానే ఒకదానిపై మరో కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో మల్లన్న ఇంతకాలం జైలులో ఉన్నారు. మల్లన్న అరెస్ట్ సమయంలో పోలీసులు సోదాలు జరిపి కొన్ని హార్డ్ డిస్క్‌లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

తీన్మార్ మల్లన్నపై ఇప్పటివరకు 38 కేసులు నమోదు కాగా అందులో ఆరు కేసులను హైకోర్టు కొట్టేసింది. మిగతా 32 కేసులో 31 కేసులకు బెయిల్ మంజూరైంది. తీన్మార్ మల్లన్న 74 రోజులు జైల్లో ఉన్నారు. తిన్మార్ మల్లన్నపై కేసుల విషయంలో మల్లన్న భార్య అమిత్‌షాను కూడా కలిసింది. తన భర్తపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేసింది. ఎట్టకేలకు మల్లన్నకు బెయిల్ మంజూరైంది.