సువర్ణమ్మకు జనసేన తరపున పెన్షన్ అందించిన బాలరాజు

పాణ్యం నియోజకవర్గం, జనసేన పార్టీ ఇంచార్జ్ చింత సురేష్ బాబు ఆధ్వర్యంలో కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 19వ వార్డులో పూలే అంబేద్కర్ కాలనీలో నివసిస్తున్న పి. సువర్ణమ్మ వయసు 69 సంవత్సరాలు ఈమెకు రెండవ నెల కూడా జనసేన పార్టీ తరపున జనసేన నాయకులు బాలరాజు (బాలు) పెన్షన్ 2500 ఒక రూపాయి అందించడం జరిగినది.

క్రిందటి నెల ఈమె పెన్షన్ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా అధికారులు ఇంకా స్పందించకపోవడం బాధాకరం. మేయర్ బి వై రామయ్య ఇలాక అయినటువంటి 19వ వార్డులోనే అర్హులైన ఇలాంటి నిరుపేదలకు పింఛన్ అందించడం లేదు. ఇక ప్రభుత్వం మిగతా వారికి ఏ విధంగా పెన్షన్ ఇస్తున్నారో చెప్పాల్సి ఉంది. మీరు స్పందించని ఎడల తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వెంటనే ఇలాంటి నిరుపేదలకు పెన్షన్ అందించాల్సిందిగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెన్షన్ అమలు చేసే వరకు కచ్చితంగా జనసేన పార్టీ ప్రతి నెల ఇలాగే ముందుకు వస్తుంది.