ఆన్‌లైన్‌ రమ్మీ, పోకర్‌ పై నిషేధం

సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశoలో ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆన్‌లైన్‌ రమ్మీ, పోకర్‌ వంటి బెట్టింగ్ గేమ్స్ పై నిషేధం విధిస్తూ ఏపీ గేమింగ్‌ యాక్ట్‌-1974 సవరణలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నిర్వాహకులు మొదటిసారి పట్టుబడితే ఏడాది జైలు, రెండోసారి పట్టుబడితే రెండేళ్లు జైలు శిక్ష విధించాలని.. ఆన్‌లైన్‌ జూదం ఆడేవాళ్ళు పట్టుబడితే 6 నెలల జైలు విధించాలంటూ ఏపీ కేబినెట్‌ నిర్ణయించింది.