Kothapeta: జోరువానలో తడుస్తూ ప్రచారం చేస్తున్న బండారు

నాయకుడు అంటే పదవి కాదు నమ్మకం.
ప్రజలతో కలిసిపోతున్న కొత్తపేట నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్.

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా జనసేన నాయకులు కార్యకర్తలు అస్సలు తీసిపోవటం లేదు. అందులో భాగంగా కొత్తపేట నియోజకవర్గం లొల్ల గ్రామంలో పంచాయితీ బై ఎలక్షన్ జరగటం వలన సర్పంచ్ అభ్యర్థిగా శ్రీ తూము బుద్దుడు సతీమణి వరలక్ష్మి పోటీ చేస్తున్నారు ఈమెకు మద్దతుగా శుక్రవారం బండారు శ్రీనివాస్ ప్రచారంలో పాల్గొన్నారు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా తడుస్తూ ప్రచారంలో పాల్గొని పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేసి సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసైనికులు బండారును అభినందిస్తూ పవన్ కల్యాణ్ ఒక మీటింగ్ లో వర్షం వస్తే జనసైనికులు తడుస్తూ ఉంటే మీరు తడుస్తున్నారుగా నేను గొడుగులో ఉండటం నాకు ఇష్టం ఉండదు అని గొడుగు తీసేసి సభలో ప్రసంగించిన సందర్భం గుర్తు చేసుకుని బండారు కూడా ఈ రోజు వర్షంలో తడుస్తూ ప్రచారంలో పాల్గొంటాం చాలా సంతోషం ఉందని జనసైనికులు మరియు గ్రామప్రజలు ఇలాంటి నాయకుడు రాజకీయాలలో ఉండాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో 100 సోల్జర్స్ సభ్యులు మరియు జనసైనికులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.