కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా ఉంటున్న బండారు శ్రీనివాస్

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ అధినేత, ప్రముఖ జనసేన నాయకులు, ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ ఆదివారం వానపల్లి గ్రామంలో ఇటీవల గత కొద్ది రోజుల క్రితం మరణించిన పూలమరి సత్యవతి, తిరునాధము పల్లంరాజు మరియు బండారు వీర్రాజు కుటుంబ సభ్యులను పరామర్శించి, ఎంతో ధైర్యంగా ఉండాలని, కుటుంబ సభ్యులందరిని కలిసి వారి కష్టసుఖాల్లో మేము ఎప్పుడూ ఉంటామని, ఎంతో ఆత్మీయతతో వారందరిని పేరుపేరునా పలుకరించి, పరామర్శించారు. ఒక గొప్ప నాయకుని నాయకత్వంలో మేమంతా ముందుకు సాగుతున్నఒదులకు గర్వంగా ఉందని జనసైనికులు ఈ సందర్భంగా తెలియజేశారు.