ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబానికి బండి రామకృష్ణ చేయూత

మచిలీపట్నం: జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ మాట్లాడుతూ మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలోని కొత్తపేటకు చెందిన చెన్ను నరేంద్రబాబు చక్కెర వ్యాధి కారణంగా కిడ్నీలు పనితీరు మందగించడం వలన డయాలసిస్ తో వైద్యం అందించవలసివస్తుందని చిన్న వయసులోనే ఇటువంటి అనారోగ్య పరిస్థితి రావడం అత్యంత బాధాకరమని అన్నారు. నరేంద్రబాబు వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడని చక్కెర వ్యాధి కారణంగా పనిచేయలేని పరిస్థితి ఏర్పడిందని బాధితునికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారని తెలిపారు. ఉన్నదాంట్లో హాయిగా బ్రతుకుతున్న కుటుంబంలో నరేంద్రబాబు అనారోగ్యం కారణం చేత కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని నా వంతు సాయంగా 5000 రూపాయలు నగదు, చలమలశెట్టి బాలాజీ(ఎన్ ఆర్ఐ) 5,000 వేల రూపాయల విలువైన నిత్యావసర సరుకులు మరియు ప్రతినెల ఇంటి అద్దెను బాలాజీ ఇస్తున్నారని స్వచ్ఛంద సంస్థలు మానవతావాదులు నరేంద్రబాబు కుటుంబానికి తమ వంతు సాయం అందించి ఆదుకోవాలని బండి రామకృష్ణ పిలుపునిచ్చారు. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు అండగా ఉన్న మచిలీపట్నం జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ కి మరియు ఎన్నారై చలమలశెట్టి బాలాజీకి జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.