శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి మహోత్సవంలో బత్తుల

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, కోరుకొండ గ్రామంలో వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి 70వ షష్ఠి మహోత్సవనికి ప్రత్యేక ఆహ్వానము మేరకు హాజరై స్వామి వారిని రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు బత్తుల దంపతులు సమర్పించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ కమిటి వారు బత్తుల దంపతులకు శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి వెంట జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, కోరుకొండ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.