పెనకటి నానాజీని పరామర్శించిన బత్తుల దంపతులు

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన పెనకటి నానాజీ అనారోగ్యంతో రాజమండ్రి దానవాయిపేటలో గల రాజీవ్ న్యూరో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకుని అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని తెలియజేసారు. వీరితో పాటు జనసేన పార్టీ నాయకులు మద్దాల గంగాధర్, మద్దాల దుర్గ ప్రసాద్, దొడ్డి అప్పలరాజు, సూరిశెట్టి అవతారం మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.