సోషల్ మీడియా వారియర్స్ కి దిశా నిర్దేశం చేసిన బత్తుల

  • పూర్తిస్థాయిలో ఎన్నికల రణరంగానికి సిద్ధమవ్వండి యువసైన్యం యోధులరా.
  • ప్రతి జనసైనికుడిని కంటికి రెప్పలా కాపాడుకునే విషయంలో ఎలాంటి అలసత్వాన్ని ప్రదర్శించను, అలాగే ఎల్లప్పుడూ మీకు ప్రతి విషయంలో అండగా ఉంటానని తెలియ పరుస్తూ నేను, మన నాయకులు మీకు అండగా ఉంటారు

రాజానగరం: పార్టీ కార్యక్రమాలు & పలు సేవా కార్యక్రమాలను విరివిగా, ఉదృతంగా సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్తూ.. అదే సమయంలో అవినీతి, అరాచక బ్లేడ్ బ్యాచ్ పాలనతో పెట్రేగిపోతున్న “జక్కంపూడి” కుటుంబానికి చుక్కలు చూపిస్తూ.. సోషల్ మీడియా వేదికగా శౌర్యాన్ని, ప్రతిభను చూపిస్తున్న.. జనసేన సోషల్ మీడియా వారియర్స్ కి దిశా నిర్దేశం చేసిన రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జ్ బత్తుల బలరామకృష్ణ. విద్య, వైద్యం, ఉద్యోగం, ప్రజా సంక్షేమం ప్రజలకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు సక్రమంగా ప్రజలకు అందించి రాష్ట్రం సుపరిపాలనతో, అవినీతిరహిత సమగ్రాభివృద్ధి చెందాలని. నిరంతరం శ్రమిస్తున్న, తపన పడుతున్న మన అధినేత పవన్ కళ్యాణ్ మీద అభిమానం, నమ్మకం సమాజం పట్ల బాధ్యత.. బత్తుల బలరామకృష్ణ సమర్థవంతమైన నాయకత్వంపై నమ్మకంతో రాజానగరం నియోజకవర్గం, 2024లో జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా శ్రమిస్తున్న, పోరాడుతున్న “జనసేన సోషల్ మీడియా వారియర్స్” అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. మన వెనక కొన్ని లక్షల మంది జనం ఉన్నారనే ధైర్యం ఉంది కాబట్టే ఒక పెద్ద యుద్ధాన్ని గెలుస్తున్నాం.. అదే జనం వెనుక పవన్ కళ్యాణ్, బత్తుల బలరామకృష్ణ ఉన్నారనే నమ్మకం కలిగింది కాబట్టే మనం రాజానగరం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో విజయం సాధిస్తున్నాం.. సుపరిపాలన అందివ్వబోతున్నాం..ఇదే శాసనం, అక్షరసత్యం కూడా అని బత్తుల పేర్కొన్నారు.